చిక్కడపల్లి, మే 3: బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ విపత్తుల నిరోధంలో స్థానిక సంస్థల పాత్రను మరింత పెంచాలన్నారు. కొవిడ్ నిర్మూలనలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనాతో అనేక మంది చనిపోతున్నారన్నారు. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు పార్టీలకతీతంగా అందరూ ముందుకు రావాలన్నారు. జిల్లాలోనూ ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, వర్గసభ్యులు జాన్వెస్లీ, డీజీ నర్సింహారావు, బి.వెంకట్, టి. జ్యోతి పాల్గొన్నారు.