రామన్నపేట: పిల్లాయిపల్లి కాలువ పనులకు ఆటంకం కలిగించొద్దని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. శనివారం మండలంలో వెల్లంకి- సుంకెనపల్లి గ్రామ సరిహద్దుల్లో జరుగుతున్న పిల్లాయిపల్లి అధునీకరణ పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. కాల్వ పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను, అధికారులను ఆదేశించారు.
అనంతరం వెల్లంకి, సర్నేనీగూడెం గ్రామల్లో రైతులతో మాట్లాడారు. పనులకు ఆటంకం కలిగించొద్దని కోరారు. భూమి కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం అందించే పూర్తి బాధ్యత తనదేనని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, నాయకులు పున్న జగన్ మోహన్, తిమ్మాపురం మహేందర్రెడ్డి, కన్నెబోయిన బలరాం, పోతరాజు సాయి, ఆమేర్, కర్రె రమేశ్ తదితరులు పాల్గొన్నారు.