రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతితో గ్రామాలకు మహార్ధశ చేకూరిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని వెల్లంకి గ్రామంలో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేసి శంఖుస్థాపన చేశారు. అదేవిధంగా ఎడ్ల వెంకట్రెడ్డి- పార్వతమ్మల జ్ఙాపకార్ధం వారి కుమారుడు ఎడ్ల సుదర్శన్రెడ్డి – జయమ్మలు మూడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నీటి శుద్ధీకరణ ప్లాంట్ భవనాన్ని ప్రారంభించారు.
అనంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పల్లె ప్రగతి పనుల ద్వారా గ్రామాల రూపు రేఖలు మారిపోయాయని , పిల్లాయిపల్లి కాల్వ అధునీకరణ పనులు నెల రోజుల్లో పూర్తి కానున్నాయని దీని ద్వారా వేల ఎకరాల భీడు భూములు సాగులోకి వస్తాయన్నారు. పిల్లాలయిపల్లి కాల్వలో భూములు కోల్పోయిన రైతులకు 16కోట్లు విడుదల చేయించడం జరిగిందని తెలిపారు.
కరోనా నేపథ్యంలో ఆదాయం తగ్గిన కేసీఆర్ ప్రభుత్వం ప్రతి పథకంను ప్రజా శ్రేయస్సు, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నదని వెల్లంకి గ్రామ అభివృద్ధికి అన్నివిధాలా తన సహాకారం ఉంటుందని తెలిపారు. సర్పంచ్ ఎడ్ల మహేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన బలరాం, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, ఎంపీటీసీలు తిమ్మాపురం మహేందర్రెడ్డి, ఎర్రోళ్ల లక్ష్మమ్మ, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి కంభంపాటి శ్రీనివాస్, మందడి శ్రీధర్రెడ్డి, తాళ్ల పల్లి సత్తిరెడ్డి, పున్న నర్సింహ్మ, మందడి ఉదయ్రెడ్డి, సర్పంచ్లు గుత్తా నర్సిరెడ్డి, ధర్నెరాణి, రేఖ యాదయ్య, నాయకులు బొక్క మాధవరెడ్డి, కర్రె రమేష్, ఎడ్ల నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.