ఆత్మకూరు(ఎం): పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పనులను గురువారం జిల్లా విజిలెన్స్ మేనేజర్ ఆదిత్య వర్థన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని పల్లెర్ల, పోతిరెడ్డి గ్రామాలలో సంబంధిత రికార్డులను ఆయన తనిఖీ చేసి మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో ప్రతి రోజూ పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. గ్రామాల్లో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం చేయకుండా విధులు నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట సర్పంచ్లు నాయిని నర్సింహారెడ్డి, గనగాని మాధవి, ఏపీవో రమేశ్, పంచాయతీ కార్యదర్శులు అనిత, నరేశ్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.