యాదాద్రి భువనగిరి : జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న సాయిబాబాను రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు నిర్దేశించిన లక్ష్యం సాధించడంలో వెనుకబడి పోవడం, పనితీరులో మార్పు రానందున ఆ శాఖకు సరెండర్ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
చౌటుప్పల్ డివిజనల్ పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న సాధనకు ఇంచార్జ్ డీపీవోగా బాధ్యతలు అప్పగించినట్లు కలెక్టర్ తెలిపారు.