భువనగిరి అర్బన్: రైతులు నూతన వ్యవసాయ పద్దతులను పాటించి అధిక దిగుబడులు పొందాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ అన్నారు. మండలంలోని వీరవెల్లి గ్రామంలో రైతు చంద్రశేఖర్రెడ్డి స్వయంగా డ్రమ్ సీడర్ను తయారు చేసి డ్రమ్ సీడర్ విధానంతో నాటిన వరిని మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ వ్యవసాయ రంగంలో ఆదునాతన పద్ధతులు అవలంభించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలన్నారు.
కూలీల కొరత ఉన్న క్రమంలో వరినాటు యంత్రంతో వరి నాటితే కూలీల ఖర్చు తగ్గడంతో పాటు సరైన సమయంలో నాటు వేయవచ్చునని చెప్పారు. రైతులు ఆ డ్రమ్ సీడర్ విధానాన్ని అవలంబించి అధిక దిగుబడిని పొందాలన్నారు. కార్యక్ర మంలో మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్రెడ్డి, ఏఈఓ శ్రీనివాస్, మండల రైతుబంధు కో-ఆర్డినేటర్ కంచి మల్ల య్య, గ్రామ రైతు కో-ఆర్డినేటర్ తోటకూరి శంకరయ్య, పీఏసీ ఎస్ డైరక్టర్ వెంకట్రెడ్డి, ఎంపీటీసీ కంచి లత, అభ్యదయ రైతులు శ్రీనివాస్రెడ్డి, రేగు వెంకటేశం, దాచెపల్లి వెంకటేశం, భూపాల్రెడ్డి పాల్గొన్నారు.