కుత్బుల్లాపూర్, మే 3 : ఓఎల్ఎక్స్లో ప్రకటలు పెట్టి మోసాలకు పాల్పడుతున్న సైబర్ చీటర్ను పేట్బషీరాబాద్ పోలీసులు అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుచిత్రలోని కృష్ణమూర్తినగర్ కాలనీకి చెందిన ఇవాన్రాజ్ ఏప్రిల్ 20న ఓఎల్ఎక్స్లో ఓ వస్తువు విక్రయానికి పెట్టిన ప్రకటనను చూసి.. అందులోని నంబర్ను సంప్రదించాడు.. అవతలి నుంచి రంజిత్రెడ్డి అనే యువకుడు మాట్లాడి.. వస్తువును విక్రయిస్తానని చెప్పి.. అడ్వాన్స్గా రూ.15వేలు పంపించాలని చెప్పగా అతను పంపించాడు. ఆ తర్వాత మరో రూ.6,500 పంపించాడు.. ఎంతకీ వస్తువు రాకపోవడంతో రంజిత్రెడ్డికి ఫోన్చేయగా ఎలాంటి సమాధానం లేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడు రంజిత్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడిది ఏపీ, విజయనగరం అని.. ప్ర స్తుతం బాగ్అంబర్పేటలో ఉంటున్నాడని తేలింది.