వలిగొండ, మే 29: ప్రజలు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య హెచ్చ రించారు. శనివారం ఆయన మండల కేం ద్రంలోని పోలీస్ చెక్పోస్టు వద్ద లాక్డౌన్ అమలు తీరును పరిశీలించి, అక్కడి సిబ్బం దితో మాట్లాడారు.ప్రజలు అనవసరంగా రోడ్లకి రావొద్దన్నారు. అనంతరం రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళాకారులతో కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన వెంట ఎస్ఐ రాఘవేందర్గౌడ్, సిబ్బంది ఉన్నారు.