మోత్కూరు: మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని నియమాకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. రఘునందన్రావు ఉత్తర్వు లు జారీ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరేగూడెంకు చెందిన కొణతం యాకు బ్రెడ్డి, వైస్ చైర్మన్గా మూగల శ్రీనివాస్ (వస్తాకొండూర్), మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా వంగరి మల్లయ్య(తుర్కలశాపు రం), గడ్డం దశరథ(ఆత్మకూరు(ఎం), సోలిపురం లకా్ష్మరెడ్డి(ఇప్పల), కొంగరి ఎల్లయ్య(ఖప్రా యపల్లి), కంచర్ల చల పతిరెడ్డి (దొంగల రాపాక), పబ్బు జయమ్మ( పాలడుగు),సోమనర్సయ్య( మోత్కూరు), సోమ వెంకటేశ్వర్లు (మో త్కూరు)లను నియమిస్తూ ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది.
మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరేగూడెంకు చెందిన కొణతం యాకుబ్రెడ్డి టీఆర్ఎస్ అవిర్భావం నుంచి పార్టీ పటిష్టత కోసం పని చేస్తున్నాడు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ కు ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. తెలం గాణ రాష్ట్రం ఏర్పాటు ఆవిర్భావం అనంతరం 2014లోనే వ్యవసాయ మార్కెట్కు చైర్మన్గా నియామకం కోసం ఎమ్మెల్యే గాదరి ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. కానీ ప్రభుత్వం మార్కెట్ పాలక వర్గాల నియామకంలో రిజర్వేషన్ల ప్రక్రియను అమలు చేయడం వల్ల మోత్కూరు మార్కెట్ ఎస్సీలకు రిజర్వు కావడంతో అవకాశం దక్కలేదు. ఆ తర్వాత 2018 డిసెంబర్లో మోత్కూరు మార్కెట్ పదవీ ఎస్టీలకు రిజర్వు కావడంతో వైస్ చైర్మన్గా యాకుబ్రెడ్డికి అవకాశం దక్కగా ఏడాదిన్నర పాటు పని చేశారు.
ఇప్పుడు మార్కెట్ పదవి జనరల్కు రావడంతో చైర్మన్గా యాకుబ్రెడ్డికి అవకాశం దక్కింది. ఉద్యమం నాటి నుంచి పార్టీలో చురుకుగా పనిచేసిన యాకుబ్రెడ్డికి మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి, ఆయిల్ఫెడ్ కార్పోరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ఆశీస్సులు ఉన్నాయి. మార్కెట్ చైర్మన్గా యాకుబ్రెడ్డి నియమాకం పట్ల మోత్కూరు, గుండాల, ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు మండలాల్లో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.