సంస్థాన్ నారాయణపురం: ప్రభుత్వం ఇంటింటికీ అందజేస్తున్న మీషన్ భగీరథ నీరు ఆరోగ్యానికి శ్రేయస్కరమని డీఎంహెచ్వో సాంబశివరావు, డీపీవో సాయిబాబ అన్నారు. మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన రాపోలు భాస్కర్ అనే వ్యక్తికి గతంలో గ్రామంలో కిడ్నీ వ్యాధులు, ఫ్లోరిన్ సమస్య ఉందని కృష్ణ వాటర్ సఫ్లయ్ జరుగడం లేదని హెచ్ఆర్సీకు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ అదేశాల మేరకు శుక్రవారం వివిధ శాఖల అధికారులు గ్రామంలో ప్రతి ఇంటికీ తిరిగి నీటి నమూనాలు సేకరించి పరీక్షలు చేశారు.
ఈ సంధర్భంగా అధికారులు మాట్లాడుతూ గతంలో గ్రామంలో మీషన్ భగీరథ వాటర్ సరఫరా కాకపోవడంతో ఫ్లోరిన్ నీళ్లు త్రాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చాయని తెలిపారు. గ్రామంలో ప్రతి ఇంటికీ మీషన్ భగీరథ నీళ్లు సరఫరా అవుతున్నాయని ప్రస్తుతం ఫ్లోరిన్ సమస్య పూర్తిగా తీరిందన్నారు. కార్యక్రమంలో ఆర్డబ్యూఎస్ డీఈఈ దీన్దయాల్, ఎంపీడీవో యాదగిరి, సర్పంచ్ సామల భాస్కర్, ఏఈ అనుష, ఎంపీవో శశికళ, మండల వైద్యాధికారి రేష్మ, పంచాయితీ కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు.