యాదాద్రి భువనగిరి : రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ ఆరోగ్యం క్షేమంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నారు. త్వరగా కొవిడ్ బారి నుంచి కోలుకోవాలని కాంక్షించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, కరోనా పీడ వదలాలని ప్రార్థించారు.
సాగర్ ఉపఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని మరోమారు చెప్పారన్నారు. నేటి మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికల్లో కూడా ప్రజలు కేసీఆర్ వెంటే ఉంటారన్నారు. రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేసేందుకు సీఎం కేసీఆర్కు మరింత శక్తి నివ్వాలని ఆ స్వామి వారిని కోరుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.