మోత్కూరు: మోత్కూరు మండల కేంద్రంలో జరిగిన మంత్రుల పర్యటనలో దొంగలు హల్చల్ చేశారు. శనివారం మో త్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ కొణతం యాకుబ్రెడ్డి, పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డిలకు మండల జడ్పీటీసీ సభ్యురాలు గోరు పల్లి శారద-సంతోష్రెడ్డిలు పూల బోకేలు అందజేసి స్వాగతం పలికారు.
ఇదే సమయంలో గుర్తు తెలియని దొంగలు సంతోష్రెడ్డి ప్యాంట్ జేబులో చెయ్యి పెట్టి రూ.40 వేలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మూగల శ్రీనివాస్వి రూ.37 వేలు అడ్డగూడూరుకు చెందిన బాలెంల అరవింద్ ప్యాంట్ వెనుక జేబులో పెట్టుకున్న రూ.5వేలను చోరీ చేశారు.
మంత్రులు పర్యటన అనంతరం ప్రజా ప్రతినిధులు వారి జేబులను చూసుకోగా డబ్బులు చోరీకి గురైనట్లు గుర్తించారు. అదే విధంగా నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో జరిగిన మంత్రుల పర్యటనలోనూ వల్లాలకి చెందిన టీఆర్ఎస్ రైతు వి భాగం అధ్యక్షుడు కొండ్రెటి వేణుగోపాల్రెడ్డి జేబులో నుంచి రూ.20వేలు, ఊట్కూరుకు చెందిన టీఆర్ఎస్వీ మండల అధ్య క్షుడు ఎం వెంకన్న జేబులో నుంచి రూ.27వేలు, తక్కెళ్లపాడు సర్పంచ్ భర్త వేల్పుల నరేందర్ జేబులో నుంచి రూ.8వే లు దొంగలు చోరీ చేశారు.
స్థానిక ప్రజా ప్రతినిధులు మంత్రులు పర్యటనలో బీజీగా ఉండగా దొంగలు వారి పని సునాసయంగా చేసుకుంటూ వెళ్లడంతో పోలీసుల పర్యవేక్షణపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ మేరకు బాధిత నాయకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదులు చేశారు.