హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతున్నదా? ఇప్పటికే పలు ఎన్నికల్లో కాంగ్రెస్ ఖేల్ ఖతమైపోగా.. తాజాగా పురపోరుతో దుక్నం బంద్ అయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నా యి. రాష్ట్రంలో జరిగిన మినీ మున్సిపల్ పోరు లో వెల్లడైన ఫలితాలు.. చరిత్ర చెప్పుకొని బతకటమే ఆ పార్టీ నేతలకు ఇక భవిష్యత్గా మిగిల్చాయి. ఒక్క మున్సిపాలిటీనైనా గెలువలేకపోయిన కాంగ్రెస్.. ఆయా పురపాలికల్లో కనీసం రెండంకెల స్థానాలను కూడా సాధించలేని దుస్థితికి దిగజారిపోయింది. పాతుకుపోయిన కురువృద్ధులు, జవసత్వాల్లేని ఈత రం నాయకులతో క్యాడర్ లేకుండా.. అన్నిటికి మించి ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరింది. ఉనికి కోసం కునికిపాట్లు పడుతున్న నాయకులే తప్ప ప్రజల కోసం పాటుపడే పరిస్థితిలే ని పార్టీగా కాంగ్రెస్ గురించి ప్రజలు చెప్పుకుంటున్నారు. సోమవారం వెలువడిన రెండు కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైపోయింది. సిద్దిపేట మున్సిపాలిటీలో ఆ పార్టీ కనీసం ఒక్కసీటు కూడా దక్కించుకోలేకపోయింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లోని 248 వార్డుల్లో పోటీచేసిన కాంగ్రెస్ 17 స్థానాలతో సరిపెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తన పార్టీ పదవికి రాజీనామా చేశారు.