యాదగిరిగుట్ట రూరల్: నృసింహ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ముంపుకు గురవుతున్న యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్ తండా వాసులకు పునరావాసం కల్పిస్తా మని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హామీ ఇచ్చారు. శుక్రవారం జిల్లా అదనపు ఇన్చార్జి(రెవెన్యూ)కలెక్టర్ భూపాల్రెడ్డితో కలిసి లప్పానాయక్ తండా గ్రామ భూ నిర్వాసితులతో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రిజర్వాయర్ నిర్మాణంలో లప్పానాయక్ తండా ముంపుకు గురవు తున్నదన్నారు. ఈ భూ నిర్వాసితులందరికీ పక్కనే ఉన్న దాతరుపల్లి గ్రామంలోని సర్వే 294లోని భూమిలో పునరావ సం కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
తండా వాసులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రస్తుతం తండాలో ఎంది మంది నివసిస్తున్నా రు? వారికి ఉన్న సౌకర్యాలు ఏమిటి ? పునరావసం కల్పించే చోట ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, అక్కడ ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతుల విషయం తదితర విషయాలపై అధికారులు నిర్వహించిన సర్వే కూడా పూర్తైందన్నారు. త్వరలోనే భూ నిర్వాసితులకు నష్ట పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆశోక్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.