చౌటుప్పల్ రూరల్: మండల పరిధిలోని కొయ్యలగూడెం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు కర్నాటి నారాయణకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం దక్కింది. జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ఈ పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు. ప్రకృతి నుంచి సేకరించిన రంగులతో విభన్నమైన డిజన్తో మగ్గంపై నేసిన చీరకు ఈ పురస్కారం వరించింది.
ఈ అవార్డు సాధించాలనే పట్టుదలతో ప్రకృతి నుంచి లభించే గంధం చెక్క, దానిమ్మ బెల్లం, అంజిష్ట, ఇండిగో నీలం, మోదుగు, బంతిపూల ద్వారా రంగులను తయారు చేసి నూలు ధారానికి అద్దారు. దీనితో పోచంపల్లి డబుల్ ఇక్కత్ టెక్నిక్తో 30 మోటిఫ్ లు వచ్చేలా మగ్గంపై చీరెను నేశాడు. తన భార్య, ఇద్దరు కుమారులు, కూతరు సహకారంతో ఈ చీరెను తయారు చేశాడు.
6నెలలు వారంత కలిసి శ్రమించి దీనిని రూపొందించారు. ఒక వార్పులో నాలుగు చీరెలను తయారు చేయడానికి ఈ సమయం పట్టింది. ఈ డిజన్లను ఆమెరికా, సింగపూర్, ముంబాయి ప్రాంతాలకు అర్డర్లపై సైతం పంపించారు. నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన నారాయణ చిన్నతనం నుంచి చేనేత పనిని అలవర్చుకున్నా డు. చదువుకునేప్పటి నుంచి సెలవు రోజుల్లో వృత్తిని చేసేవాడు. ఈ క్రమంలో 40 సంవత్సరాల నుంచి వృత్తినే నమ్ముకున్నాడు. అప్పటి నుంచి మగ్గంపై వస్ర్తాలు నేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం క్రితం చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి రంగుల అద్దకంలో శిక్షణ పొందారు. ఈ తర్పీదుతో అప్పటి నుంచి పర్యావరణానికి హానీ కలిగించని రంగులతో చేనేత వస్ర్తాలను తయారు చేయాలని సంకల్పించారు. దీంతో తన ఆలోచనకు మరింత పదును పెట్టి ప్రకృతి రంగులతో నేత వస్త్రాలను తయారు చేస్తు ప్రత్యేకత చాటుకుంటున్నారు.