వలిగొండ: పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ పథకం ఒక వరమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 24 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణి చేసి అనంతరం మాట్లాడుతూ ఆడపిల్లల్నికన్నతల్లి దండ్రుల ఆర్థిక కష్టాలను తీర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ పథకానికి శ్రీకారం చుట్టి రాష్ట్రంలో గొప్పగా అమలు చేస్తున్నారని,పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలకు రూపకల్పన చేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అమలు చేస్తున్న బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
కళ్యాణ లక్ష్మీ చెక్కులతోపాటు పైళ్ల ఫౌండేషన్ సౌజన్యంతో పట్టు చీర, పంచ, కండువాలను నూతన వధూ, వరులకు అందజేశారు. అనంతరం ప్రభుత్వం క్రైస్తవులకు అందించిన క్రిస్మస్ పండుగ కానుకలను ఎంపీడీవో కార్యాలయంలో క్రైస్తవులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్, జడ్పీటీసీ వాకిటి పద్మా అనంతరెడ్డి, వైస్ ఎంపీపీ బాతరాజు ఉమాబాలనర్సింహ, ఎంపీటీసీ పల్సం రమేష్, మత్స్యగిరిగుట్ట చైర్మన్ ముద్దసాని కిరణ్రెడ్డి, మండల రైతు బంధు కన్వీనర్ పనుమటి మమత నరేందర్రెడ్డి, ఏఎంసీ చైర్ పర్సన్ కునపూరి కవిత, తహసీల్దార్ నాగలక్ష్మీ,గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.