యాదాద్రి: రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం యాదాద్రికి చేరుకున్న జస్టిస్ హిమా కోహ్లీ స్వామివారి సువర్ణపుష్పార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆమెకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. దర్శణానంతరం జస్టిస్ హిమా కోహ్లీకి అర్చకులు వేదాశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట యాదాద్రి భువనగిరి కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీత తదితరులు ఉన్నారు.