చిట్యాల: టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలు పండుగ వాతావరణంలో జరగాలని, సెప్టెంబర్ 2న నిర్వహించే జెండా పండుగకు పార్టీ దిమ్మెలను సిద్ధం చేసి విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. చిట్యా లలో మంగళవారం జరిగిన టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నిక ల్లో ఈ కమిటీలే పార్టీ గెలుపులో కీలకంగా మారుతాయని, అందువల్ల కమిటీల ఎన్నికల్లో అన్ని వర్గాల వారిని కలుపు కుని పోవాలని పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గ్రామ కమిటీలు, 12 నుంచి 20 వరకు మండల కమిటీల ఎన్నికలను పూర్తి చేయాల న్నారు. పార్టీ నిబంధనల ప్రకారం 51 శాతం బడుగు, బలహీన వర్గాల వారు కమిటీల్లో ఉండేలా చూసుకోవాలని వివ రించారు. సేవకుడిలా పనిచేసే చిరుమర్తి లింగయ్యకు నియోజకవర్గం అండగా ఉండి సంస్థాగత ఎన్నికలను విజయవం తంగా పూర్తి చేయాలని కోరారు.
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుర్తి లింగయ్య మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసే వారికే ప్రాధాన్యం ఇస్తూ కమిటీలను ఏర్పాటు చేయాలని, గ్రామ స్థాయిలో అవకాశం రాని వారు అసంతృప్తి చెందొద్దని వారికి మండల, జిల్లా స్థాయిలో అవకాశం వచ్చే లా చూస్తామన్నారు. కమిటీల ఎన్నికల్లో కార్యకర్తలు, నేతలు సమన్వయంలో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జడల ఆదిమల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో
చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, ఎంపీపీ కొలను సునీతావెంకటేశ్, డీసీసీబీ వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్రెడ్డి, నార్మాక్స్ డైరెక్టర్ గంగుల కృష్ణారెడ్డి, వెల్మినేడు సింగిల్ విండో చైర్మన్ రుద్రారపు భిక్షపతి, అంతటి వెంకటేశ్, సత్తయ్య, రాచకొండ కిష్టయ్య, కూరెళ్ల లింగస్వామి, ఆవుల అయిలయ్య, సుంకరి యాదగిరి, మర్ల రాంరెడ్డి, రామన్నపేట మండల అధ్యక్షుడు నంద్యాల భిక్షంరెడ్డి, ఎంపీపీ కన్నెబోయి జ్యోతీబలరామ్, మందడి ఉదయ్కుమార్రెడ్డి, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.