భువనగిరి అర్బన్: తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో జయశంకర్ సర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ భావ జాలాన్ని విస్తృత పరిచిన వ్యక్తిగా ఆచార్య జయశంకర్ సేవలను కలెక్టర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్తివారీ, ఇన్చార్జి అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అదే విధంగా భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జయశంకర్ సర్ జయంతిని సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత, మార్కెట్ కార్యదర్శి అంజిత్రావు, నాయకులు సిద్ధుల పద్మ, సువర్ణ, సూపర్వైజర్ రాజీవ్కుమార్, సిబ్బంది రాజు, శ్రీను, ప్రవీణ్, ఆయూబ్, తదితరులు పాల్గొన్నారు.
అదే విధంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు జయశంకర్ సర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, కమిషనర్ ఎం.పూర్ణచందర్, నాయకులు బాషబోయిన రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.