హుజూర్నగర్ : తెలంగాణలో రైతులు పండిస్తున్న వరి పంటను కేంద్ర ప్రభుత్వం కొటుందా, కొనదా తేల్చి చెప్పాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన బీజేపీ నాయకులు కేంద్రంలో ఒకతీరుగా, రాష్ట్రంలో మరో తీరుగా వ్యవహరిస్తూ రైతులను గందరగోళంలో పడేస్తున్నారని మండిపడ్డారు. వానకాలం పంటను పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇప్పటికే నియోజవర్గంలో పండిన ధాన్యాన్ని మిల్లర్ల ద్వారా కొనుగోలు చేయించామన్నారు. రైతులు కూడా క్రమంగా పంట మార్పిడివైపు మళ్లాలన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా తెలంగాణ అమలు అవుతున్న రైతు సంక్షేమ పథకాలు ఉన్నాయా అని నిలదీశారు. సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు ఏఎమ్సీ చైర్మన్ కడియం వెంకట్రెడ్డి, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, గరిడేపల్లి ఎంపిపీ పెండెం సుజాత పాల్గొన్నారు.