రామన్నపేట: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగు పర్చాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి మందడి ఉపేందర్రెడ్డి తెలిపారు. ఈనెల 3వ తేదిన కేంద్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి కపిల్మోరేశ్వర్పాటిల్ మండలంలోని వెల్లంకిలో పర్యటించనున్న నేపథ్యంలో మంగళవారం ఆయన పల్లెప్రగతి, గ్రామంలోని పారిశుధ్య పనులను పరిశీలించారు.
పారిశుధ్యాన్ని మెరుగు పర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకునేవిధంగా అధికారులకు సూచనలు చేశారు. పల్లెప్రకృతి వనం లో కూలీలతో కలిసి పిచ్చిమొక్కలను తొలగించారు. ఈకార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి బాల్సింగ్, తహసీల్దార్ ఆంజ నేయులు, ఎంపీడీవో గాదే జలేంధర్రెడ్డి, ఎంపీవో ఆర్వీ సత్యనారాయణ, ఏపీవో వెంకన్న, సర్పంచ్ ఎడ్ల మహేందర్రెడ్డి, ఎంపీటీసీ మహేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి యాదయ్య పాల్గొన్నారు.