ఆలేరు రూరల్: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని శర్భనాపురం గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. పార్టీలో చేరిన వారిలో బొడ విజయ్, సుధగాని పరశు రాములు, భిక్షపతి, క్రాంతితో పాటు సుమారు 30 మంది పార్టీలో చేరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశ్గౌడ్, మాజీ ఎంపీపీ కాసగల్ల అనసూయ, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు అంగడి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.