భూదాన్పోచంపల్లి: జాతీయ చేనేత దినోత్సవాన్ని చేనేత కేంద్రమైన భూదాన్పోచంపల్లిలో శనివారం వివిధ చేనేత కార్మిక అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ చేనేత విభాగం ఆధ్వర్యంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మిలు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులను వారి గృహాలకు వెళ్లి సత్కరించారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి, సీత వెంకటేశం, చింతకింది కిరణ్ కుమార్, అంకం పాండు, సీత శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలీ చేనేత కార్మిక ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకోని సీనియర్ చేనేత కార్మికులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రుద్ర శ్రీశైలం, అంకం మురళి, మెరుగు శశికళ తదితరులు పాల్గొన్నారు.