బీబీనగర్: అత్యవసర సేవల ద్వారా ఎంతోమంది విలువైన ప్రాణాలను కాపాడొచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా అన్నారు. గురువారం మండలంలోని బీబీనగర్ ఎయిమ్స్ లో అనస్థిషియాలజీ, క్రిటికల్ కేర్ విభాగం ఆధ్వర్యంలో గత నెల 29 నుంచి నేటి వరకు ఎయిమ్స్ విద్యార్థులు, నర్సింగ్ అధికారులు, సీనియర్ రెసిడెంట్స్కు మెత్తం 275 మందికి ఇంటరాక్టివ్ వర్క్షాప్ నిర్వహించారు. దీని ద్వారా దవాఖానలో రోగి చికిత్స సేవలు, కార్డియాక్ అరెస్ట్ను ముందుగా గుర్తించడం ద్వారా అత్యవసర సేవలను అందించటంపై చర్చించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ ఈ వర్క్షాప్ జిల్లాలో ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగు పర్చ డానికి చేస్తున్న ఒక ప్రయత్నమని ఈ రకమైన కార్యక్రమాన్ని జిల్లాలో కమ్యూనిటీ స్థాయిలో చేపడుతామని అన్నారు. వర్క్ షాప్ పూర్తయిన తర్వాత విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ రాహుల్ నరాంగ్, డాక్టర్లు, విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది, పీఆర్వో డాక్టర్ శ్యామల, తదితరులు పాల్గొన్నారు.