యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి విమాన గోపురం స్వర్ణతాపడానికి పలువురు దాతలు విరాళాలు అందించారు. వరంగల్కు చెందిన శ్రీరామ్ శామమూర్తి, సరస్వతి దంపతులు రూ. 1,00,166, భువనగిరికి చెందిన హైకోర్టు న్యాయవాది ఆకులయుగాంధర్ పటేల్ రూ.52,116ను స్వామివారికి సమర్పించారు. శనివారం యాదాద్రిలో ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి గజవెల్లి రమేశ్బాబు విరాళానికి సంబంధించిన నగదు రసీదులను దాతలకు అందజేశారు.
ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ యాదాద్రి పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తుమని చెప్పారు. ఈ సందర్భంగా ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.