యాదాద్రి: యాదాద్రీశుడి నూతన గర్భాలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన వ్యక్తి విరాళం అందించారు. యాదగిరిగుట్టకు చెందిన బెజ్జంకి రామిరెడ్డి, ఇందిర దంపతులు రూ. 50,116ను సోమవారం యాదాద్రిలో ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదాద్రి పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
యాదాద్రి బాలాలయంలో ఆలయ అధికారులకు నగదు అందించిన తర్వాత బెజ్జంకి రామిరెడ్డి దంపతులకు సంబంధిత నగదు స్వామివారి ఆలయానికి అందినట్లు రసీదు ఇచ్చారు.