తుర్కపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు చరిత్రలో నిలిచిపోతుందని టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బర్ల లచ్చయ్య, పార్టీ మండలాధ్యక్షుడు తలారి శ్రీనివాస్ అన్నారు. దళితబంధు పథకం కింద వాసాలమర్రి గ్రామంలోని దళిత కుటుంబాలకు నిధులను మంజూరు చేయడాన్ని హర్షిస్తూ శుక్రవారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి టీఆర్ఎస్ నాయకులతో కలిసి క్షీరాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా దళితబంధు పథకం ద్వారా వాసాలమర్రికి చెందిన 76 దళిత కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల నిధులు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా సుశీల, జడ్పీ వైస్చైర్మన్ భీకూనాయక్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొమిరిశెట్టి నర్సింహులు, సర్పంచ్ పడాల వనిత, ఎంపీటీసీలు గిద్దె కరుణాకర్, బొరెడ్డి వనజ, మాజీ ఎంపీటీసీ తలారి శ్రీనివాస్, సోషల్మీడియా నియోజకవర్గ కన్వీనర్ నల్ల శ్రీకాంత్, కొఆప్షన్ రహమత్ షరీఫ్, బాలస్వామి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.