గుండాల : పశ్చిమబెంగాల్ నుంచి కూలీ పనులకు వచ్చిన వ్యక్తి విద్యుత్ ప్రమాదంతో బుధవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్ నుంచి విద్యుత్ టవర్ నిర్మాణ పనుల నిమిత్తం మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి కూలీకి వచ్చిన రహమాన్(43) తాము ఏర్పాటు చేసుకున్న టెంటులో నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో రహమాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
దీంతో రహమాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ఏరియా ఆసుపత్రికి పంపినట్లు ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. ఈ మెరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.