బొమ్మలరామారం: సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని తూంకుంట గ్రామానికి చెందిన మోటే అంజనేయులు ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.
అనంతరం అతడు ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.2లక్షల చెక్కును హైదరాబాద్ లోని తన నివాసంలో ప్రభుత్వ విప్ గొంగిడి బుధవారం లబ్ధిదారుకు అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేముల సురేంద ర్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు నిరుగొండ రాజు గౌడ్, మోటే యాద గిరి, నిరుకొండ రమేశ్ గౌడ్, డోకూరి జంగయ్య, ఐలయ్య, మేకల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం..
మోటకొండూర్: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. సబ్బండ కులాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. బుధవారం హైదరాబాద్లోని ప్రభుత్వ విప్ నివాసంలో మండల కేం ద్రానికి చెందిన ఎండీ షానూర్బాబాకు రూ. ఒక లక్ష, మండలంలోని సికిందర్నగర్ గ్రామానికి చెందిన షేక్ సుభానీకి రూ. 2లక్షలు, కాటేపల్లి గ్రామానికి చెందిన వరికుప్పుల రేణుకకి రూ. 60వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ.. వాటిని వంద శాతం అమలు చేస్తున్న ఏకైక నాయకుడిగా సీఎం కేసీఆర్ నిలుస్తారన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు బొట్ల యాద య్య, కో ఆప్షన్ సభ్యుడు బురాన్, సర్పంచ్లు మంత్రి రాజు, వేముల పాండు, కాటేపల్లి గ్రామ అధ్యక్షుడు కానుగంటి కొమురయ్య, సీనియర్ నాయకుడు ఏనుగు నాగిరెడ్డి ఉన్నారు.