యాదాద్రి భువనగిరి : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా యాదాద్రీశుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయ పునర్నిర్మాణ పనులను తిలకించారు. ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలో చేపట్టిన నిర్మాణ పనులు, ప్రెసిడెన్షియల్ విల్లా కాంప్లెక్స్ పనులు, ఆలయ నగరిని జస్టిస్ ఎన్వీ రమణ పరిశీలించారు. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును అధికారులు ఆయనకు వివరించారు. యాదాద్రి కళావైభవాన్ని ఆర్కిటెక్ట్ ఆనంద్సాయి సీజేఐకి వివరించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలిసారి ఆయన రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి యాదాద్రి పర్యటనకు రావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆయన వెంట దేవాదాయశాఖ కమిషనర్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పత్తి, సీపీ మహేష్ భగవత్, ఆలయ ఈఓ గీతారెడ్డి, ఆలయ చైర్మన్ నర్సింహమూర్తి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.