భువనగిరి అర్బన్: చేనేత కార్మికులు స్వయంశక్తితో ఉన్న స్థితికి ఎదగాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని వర్తక సంఘం ఆవరణలో చేనేత సంఘం ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం చేనేత జౌళీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
చేనేత కార్మికులు కేవలం పని చేసేవారు మాత్రమే కాదని, వారు వస్ర్తాలతో అద్భుతాలు సృష్టించే సృష్టికర్తలని అన్నారు. చేనేతలు సంసృ్కతి సంప్రదాయాలను భావితరాలకు అందజేస్తున్నారన్నారు. స్వదేశీ ఉద్యయమంలో కార్యరూపం దాల్చిన అహింస, సత్యాగ్రహం నాటి నుంచి చేనేత పరిశ్రమకు మరింత గౌరవం చేకూరిందని తెలిపారు. చేనేత వృత్తికి న్యాయం చేయాలని సూచించారు.
కేవలం మార్కెటింగ్ సౌకర్యాలు లేవనే భావన విడ నాడి తమలోని ప్రతిభకు పదును పెట్టాలని తెలిపారు. మరిన్ని లాభాలు రావాలంటే ఆన్లైన్లో మార్కెటింగ్ సౌకర్యాన్ని విస్తరించుకోవాలన్నారు. మున్సిపల్ కార్మికులకు చేనేత వస్ర్తాలను అందించాలని అధికారులను ఆదేశించా రు. ప్రతి సోమవారం అధికారులు విధిగా చేనేత వస్ర్తాలను ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా వకృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు మెమోంటో, ప్రశంసా పత్రాలు అందజేసి శాలువాలతో సత్కరించారు.
అదే విధంగా రూ.5 కోట్ల ఒక లక్ష విలువైన చెక్కును చేనేత మిత్ర పథకం క్రింద 9 వేల మంది లబ్ధిదారులకు నూతన సబ్సీడీ కింద అందజేశారు. పావలా వడ్డీ పథకం క్రింద 10 సంఘాలకు రూ.22,44,000లక్షల చెక్కును, ఆత్మహత్య చేసుకున్న 25 మంది చేనేత కుటుంబాలకు రూ.5,016వేల చొప్పున అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్తివారీ, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, చేనేత జౌళీశాఖ డిప్యూటీ డైరక్టర్ వెంకటేశం, వివిధ చేనేత సంఘాల చైర్మన్లు, పాల్గొన్నారు.