యాదాద్రి: కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న మోరేశ్వర్ పాటిల్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం మంత్రికి పండితులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందిచారు. అంతకుముందు ఆలయ అధికారులు, పండితులు మంత్రికి ఘనంగా ఆహ్వానం పలికారు.