భువనగిరి అర్బన్ : దివ్యాంగుల సంక్షేమంలో జిల్లా ముందంజలో ఉందని, అదనపు కలెక్టర్లు దీపక్తివారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్ఆర్ గార్డెన్లో జిల్లా మహిళా, శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యరు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం జిల్లాలోని దివ్యాంగులకు న్యాయం జరుగుతుందన్నారు. అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో లబ్ధిదారులకు అందుతున్నాయని, సంబంధిత శాఖలు సకాలంలో దివ్యాంగుల సమస్యలకు పరిష్కారం అందిస్తున్నాయని చెప్పారు.
దివ్యాంగులకు అన్ని రకాలుగా సహాయపడే టోల్ఫ్రీ నంబర్ 1800-572-8980 అందుబాటులో ఉందని, ఈ నంబర్కు ఫోన్చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులు నృత్య ప్రదర్శనలో ప్రతిభకనబరిచిన వారికి మెమోంటోలను అందజేసి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఉపేందర్రెడ్డి, అడిషనల్ పీడి నాగిరెడ్డి, 6వ స్టాండింగ్ కమిటీ ప్రెసిడెంట్ అనురాధ, జిల్లా కో-ఆర్డినేటర్ జోసెఫ్, భువనగిరి రూరల్ ఎస్సై సైదులు, సూపరింటెండెంట్ శశికళ, ఎఫ్ఆర్ఓ తిరుపతిరెడ్డి, డీసీపీఓ సైదులు, ఆయా దివ్యాంగుల అధ్యక్షుడు, దివ్యాంగులు పాల్గొన్నారు.