భూదాన్ పోచంపల్లి: భువనగిరి నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని గౌస్కొండ, రామలింగంపల్లి, జలాల్పూర్, మెహర్నగర్, దోతి గూడెం, అంతమ్మగూడెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా గౌస్కొండలో పల్లె పర్యవేక్షణ కార్యక్రమంలో భాగంగా రూ. 40 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, రూ. 20 లక్షలతో నిర్మించ నున్న అంతర్గత మురుగు నీటి కాల్వ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం వైకుంఠధామాన్ని ప్రారంభించారు. రామలింగంపల్లి గ్రామంలో రూ.15 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు అంతర్గత మురుగునీటి కాల్వల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అంతమ్మగూడెంలో రూ. 15 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు, అంతర్గత మురుగునీటి కాల్వ పనులకు శంకుస్థాపన చేశారు. జలాల్ పూర్లో రూ. 40లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, అంతర్గత మురుగునీటి కాల్వ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ. 7.5 లక్ష ల నిధులతో నిర్మించనున్న కమ్యునిటీ భవనానికి శంకుస్థాపన చేశారు.
మెహన్నగర్లో రూ.10 లక్షల వ్యయంలో నిర్మించే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. దోతిగూడెంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. వైకుంఠధామాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి, సింగిల్విండో చైర్మన్లు కందాడి భూపాల్రెడ్డి, అందెల లింగం యాదవ్, ఆయా గ్రామాల సర్పంచ్లు పక్కీరు లావణ్య, రమావత్ రాములునాయక్, పర్నె రజిత, పగిళ్ల స్వప్న , టీఆర్ఎస్ మండలాధ్యక్షులు పాటి సుధాకర్రెడ్డి, రావుల శేఖర్రెడ్డి, గోరంటి శ్రీనివాస్రెడ్డి, పగిళ్ల సుధాకర్రెడ్డి, నోముల మాధవరెడ్డి, ఐతరాజు భిక్షపతి, ఎంపీటీసీలు బొక్క అమృతమ్మ , రావుల శ్రీదేవి పాల్గొన్నారు.
భూదాన్ పోచంపల్లి: భువనగిరి నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని గౌస్కొండ, రామలింగంపల్లి, జలాల్పూర్, మెహర్నగర్, దోతి గూడెం, అంతమ్మగూడెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా గౌస్కొండలో పల్లె పర్యవేక్షణ కార్యక్రమంలో భాగంగా రూ. 40 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, రూ. 20 లక్షలతో నిర్మించ నున్న అంతర్గత మురుగు నీటి కాల్వ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం వైకుంఠధామాన్ని ప్రారంభించారు. రామలింగంపల్లి గ్రామంలో రూ.15 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు అంతర్గత మురుగునీటి కాల్వల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అంతమ్మగూడెంలో రూ. 15 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు, అంతర్గత మురుగునీటి కాల్వ పనులకు శంకుస్థాపన చేశారు. జలాల్ పూర్లో రూ. 40లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, అంతర్గత మురుగునీటి కాల్వ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ. 7.5 లక్ష ల నిధులతో నిర్మించనున్న కమ్యునిటీ భవనానికి శంకుస్థాపన చేశారు.
మెహన్నగర్లో రూ.10 లక్షల వ్యయంలో నిర్మించే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. దోతిగూడెంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. వైకుంఠధామాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి, సింగిల్విండో చైర్మన్లు కందాడి భూపాల్రెడ్డి, అందెల లింగం యాదవ్, ఆయా గ్రామాల సర్పంచ్లు పక్కీరు లావణ్య, రమావత్ రాములునాయక్, పర్నె రజిత, పగిళ్ల స్వప్న , టీఆర్ఎస్ మండలాధ్యక్షులు పాటి సుధాకర్రెడ్డి, రావుల శేఖర్రెడ్డి, గోరంటి శ్రీనివాస్రెడ్డి, పగిళ్ల సుధాకర్రెడ్డి, నోముల మాధవరెడ్డి, ఐతరాజు భిక్షపతి, ఎంపీటీసీలు బొక్క అమృతమ్మ , రావుల శ్రీదేవి పాల్గొన్నారు.