భువనగిరి కలెక్టరేట్: సంస్కృతి, సంప్రదాయాలతో మట్టి గణపతులను ప్రతిష్ఠించుకుని మహాగణపతిగా ఆరాధించుకోవాల ని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. శుక్రవారం నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యం లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ ఆవరణ ఏర్పాటు గురువారం ఏర్పాటు చేసిన ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను ప్రతిష్ఠించుకోవాలని కోరారు. త్రాగునీటి వనరులలో నిమజ్జనం చేపట్టడం మూలం గా నీటి అడుగు భాగంలో విగ్రహాల రసాయనాలు పేరుకుపోయి నీటి కాలుష్యం ఏర్పడుతుందని తద్వారా ప్రజల ఆరోగ్యానికి పెను ప్రమాదం సంభవించే అవకాశాలుంటాయని కలెక్టర్ అన్నారు.
గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, మాస్కులు, భౌతిక దూరం, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలన్నారు. అప్రమత్తంగా ఉండి థర్డ్ వేవ్ ముప్పు నుంచి స్వీయ రక్షణ పొందాల న్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్రెడ్డి, దీపక్తివారీ తదితరులున్నారు.