భువనగిరి అర్బన్ తెలంగాణ ప్రభుత్వంతోనే గ్రామాలకు మహార్థశ పట్టిందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని అనాజీపురం నుంచి నమాత్పల్లి వరకు 3కోట్ల 10లక్షలతో, సిరివేణికుంట నుంచి నందనం వరకు 2కోట్ల 65 లక్షలతో, బొల్లేపల్లి నుంచి టేకులసోమారం వరకు కోటి 90లక్షలతో నిర్మించనున్న బీటి రోడ్ల నిర్మాణ పనులకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాలకు అన్ని లింకు రోడ్లను దశలవారీగా పూర్తి చేస్తామ న్నారు. గతంలో ప్రజలు ఒక గ్రామం నుంచి మరోక గ్రామానికి వెల్లాలంటే ఇబ్బందులు పడేవారని, టీఆర్ఎస్ ప్రభుత్వ హా యాంలో గ్రామ గ్రామానికి లింకు రోడ్లు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తుంద న్నారు.
నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రజా సమస్యలను తీర్చడంతో పాటు ప్రతి గ్రామంలో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం దశలవారీగా పూర్తి చేస్తామన్నారు. పల్లె ప్రగతిలో ప్రజా సమస్యలను గుర్తించడంతో పాటు పరిష్కారమయ్యాయ న్నారు.
కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేష్గౌడ్, ఎంపీ పీ నరాల నిర్మలవెంకటస్వామి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, మండల అధ్యక్షుడు జనగాం పాండు, ప్రధానకార్యదర్శి నీల ఓం ప్రకాశ్, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి, నాయకులు జక్క రాఘవేందర్ రెడ్డి, పుట్ట వీరేశ్, సామల వెంక టేశ్, చిలువేరు మధు, ప్రవీణ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్దాపన
బీబీనగర్: మండల పరిధిలోని రాఘవాపురం, లక్ష్మీదేవిగూడెం, బ్రాహ్మణపల్లి గ్రామాల నుంచి ఎర్రబెట్టె తండా వరకు పీఎంజీఎస్వై ద్వారా మంజూరైన రూ.3 కోట్ల 11లక్షల నిధులతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమి నేటి కృష్ణారెడ్డితో కలసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు.
కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్రెడ్డి, పీఏసీయస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ దర్మ బస్వారెడ్డి, ఎంపీటీసీలు గుంటిమీది అండాలు అశోక్, గోరుకంటి బాల్చందర్, సర్పంచ్ మంచాల రవి కుమార్, ఎంపీడీవో శ్రీవాణి, ఎంపీవో స్వాతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్రెడ్డి, నాయకులు, కార్యక ర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.