భువనగిరి కలెక్టరేట్: ప్రాణాలను నిలపాల్సిన డాక్టర్ నిర్లక్షం కారణంగా కడుపులోని శిశువుతో పాటు తల్లి మృతి చెందిన ఘటనలో మరో చిన్నారి అనాథగా మారిన ఘటన పట్టణ పరిధిలోని రాయగిరిలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చింతల మమత గత సంవత్సరం మొదటి కాన్పు కోసం పట్టణం లోని కేకే నర్సింగ్హోంకు వెళ్లింది.
శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు మమత కడుపులో దూదిని వదిలి కుట్లు వేశారు. ఈ క్రమంలో రెండోసారి గర్భవతి అయిన మృతురాలు మమత నిత్యం కడుపునోప్పితో బాధ పడుతూ పలు దవాఖానలకు వెళ్లినా ఫలితం లేకపోయింది. కాగా మూడు రోజుల క్రితం తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతున్న మమతను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేటు దవాఖానకి తీసుకువెళ్తుండగా కడుపులోని శిశువు మృతి చెంది తీవ్ర రక్తసావ్రం అయ్యింది.
దీంతో మృతురాలు మమతకు ఆపరేషన్ చేయాల్సి వస్తుందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు అందుకు అంగీకరించడంతో వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఈక్రమంలో మమత కడుపులోని పేగుల్లో దూది ఉన్నట్లు గుర్తించా రు. ఇట్టి విషయాన్ని మమత కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆదివారం శస్త్రచికిత్స నిర్వహించగా సోమవారం అర్ధ రాత్రి మమత మృతి చెందింది.
మమత మృతికి గతంలో ఆపరేషన్ సమయంలో డాక్టర్లు వదిలిన దూది కారణమన్న విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు భువనగిరిలోని కేకే నర్సింగ్హోంకు మృతదేహంతో వచ్చి మంగళవారం ఆందోళన నిర్వ హించారు. మమత మృతికి కారణమైన వైద్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీ సులు సంఘటనా స్థలానికి చేరకుని ఆందోళనను విరమింప జేశారు. మమత మృతితో చిన్నారి అనాధగా మారిందని మృతురాలి బంధువులు రోధించడం పలువురిని కన్నీరు పెట్టించింది.