భువనగిరి అర్బన్: అర్వులైన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. మండలం, పట్టణానికి చెందిన 46 మంది సీఎం సహయనిధికి ధరఖాస్తు చేసుకోగా మంజరైన రూ.13లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు వేర్వేరుగా శనివారం ఆయన ప్రత్యేక కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందన్నారు. ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు వెన్నంటి ఉండాలన్నారు. ప్రభుత్వం అంద జేస్తున్న పథ కాలను అర్వులైన వారికి అందేలా నాయకులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఉడుత శారద, కౌన్సిలర్ వడిచర్ల లక్ష్మి, మాజీ కౌన్సిలర్ లయిఖ్అమ్మద్, నాయకులు తాడూరి భిక్షపతి, మురళి పాల్గొన్నారు.