సంస్థాన్ నారాయణపురం : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత రంగంలో విశేష కృషి చేస్తున్న కళాకారులకు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం కొం డా లక్ష్మణ్ బాపూజీ అవార్డుతో సత్కరిస్తుంది. ఈ క్రమంలో ఈ సంవత్సరం ప్రకృతి సిద్ధమైన రంగులతో తేలియా రుమాలు తయారు చేసినందుకు గాను సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన అయిటిపాముల నీరజకు అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్లోని పీపుల్స్ ఫ్లాజాలో చేనేత మరియు మంత్రి కేటీఆర్ నీరజ ను శాలువాతో సత్కరించి అవార్డు అందజేశారు.
అదే విధంగా పుట్టపాకకు చెందిన వింజమూరి విజమలక్ష్మికి మంత్రి ఆసు యంత్రం అందజేశారు. ఈ సంధర్భంగా సర్పంచ్ సామల భాస్కర్, చేనేత సహకర సంఘం అధ్యక్షురాలు విజయలక్ష్మి మంత్రి కేటీర్ను తేలియా రుమాలుతో సన్మానించారు. పుట్టపాక గ్రామాన్ని సందర్శించాలని కోరగా తప్ప కుండా వస్తానని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో పద్మశ్రీ గజం గోవర్ధన్, గజం అంజయ్య, హనుమంతు, భావనరుషి, శ్రీనివాస్, శంకర్ పాల్గొన్నారు.
పురస్కారం అందుకున్న నారాయణ
చౌటుప్పల్ రూరల్: ప్రకృతి నుంచి సేకరించిన రంగులతో విభన్నమైన డిజన్లతో మగ్గంపై చీర నేసినందుకు గాను మండల పరిధిలోని కొయ్యలగూడెం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు కర్నాటి నారాయణకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం లభించగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఆవార్డును నారాయణకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ చేనేతకు చేయూతనిస్తోందన్నారు.
అవార్డు అందుకున్న బాలయ్య
భూదాన్ పోచంపల్లి: 121 రంగులతో 121డిజైన్లతో చీర నేసినందుకు గాను పోచంపల్లికి చెందిన భోగ బాలయ్యకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు వరించగా శనివారం హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ ఈ ఆవార్డును అందజేశారు. అదేవిధంగా అధునాతన డిజైన్లతో ఎక్కువ మందికి ఉపాధి కల్పించినందుకుగాను పోచంపల్లికి చెందిన యవ డిజైనర్ సాయిని భరత్ను మంత్రి సత్కరించా రు. కార్యక్రమంలో చేనేత జౌళీ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.