నాగపంచమిని పురస్కరించుకుని శుక్రవారం నియోజకవర్గంలోని ఆలేరు టౌన్, ఆలేరు రూరల్, మోటకొండూర్, రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో మహిళలు నాగ దేవతల పుట్టల్లో పాలు పోసి, గుడ్లు వేసి మొక్కలు చెల్లించుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులతో ఆయా దేవాలయాలు స్వల్ఫ రద్దీగా మారాయి.