యాదాద్రి భువనగిరి : అప్పు ఇచ్చిన వ్యక్తి దూషించడంతో మనస్తాపంతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని సాయిగూడెంలోఈ ఘటన జరిగింది.
గ్రామానికి చెందిన జన్నె భిక్షపతి (37) వ్యవసాయంతో పాటు ట్రాలీ ఆటోను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఆటో మరమ్మతుకు గురికావడంతో ఓ ఆటోమొబైల్ దుకాణంలో విడిభాగాలను ఉద్దెరపై కొన్నాడు.
కొంత బాకీ తీర్చగా మిగిలింది తీర్చాలంటూ షాపు నిర్వాహకుడు భిక్షపతిని దూషించి ఆటోను తీసుకెళ్లాడు. పరువు పోయిందని భావించిన భిక్షపతి ఇంటికి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకు న్నాడు.
ఆటోమొబైల్ షాపు ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆందోళనకు దిగారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.