ఆలేరు రూరల్: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన ఎలగందుల మమతకు సీఎం సహయనిధి నుంచి మంజూరైన రూ.2లక్షల చెక్కును హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకునే నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు.