యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామానికి చెందిన తుర్కపల్లి లలితకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 2 లక్షల చెక్కును ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సోమవారం అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనునిత్యం ప్రజా సంక్షేమం కృషి చేస్తున్నారని తెలిపారు.
ప్రజలెవరైనా ఆనారోగ్య సమస్యలతో దవాఖానలో చికిత్స పొందితే వారి ఖర్చులను భరిస్తూ సీఎం కేసీఆర్ వారికి అండగా నిలుస్తున్నారని దీని వలన ప్రజలకు చాలా ప్రయోజనం ఉంటుందని, తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను సీఎం కేసీఆర్ కల్పించాడని అన్నారు. కార్యక్రమంలో దాతరుపల్లి ఎంపీటీసీ కాల్నె అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.