భూదాన్పోచంపల్లి/బీబీనగర్: కరోనా దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ దేవసేన సూచించారు. భూదాన్పోచంపల్లిమండల పరిధిలోని ఆదర్శ పాఠశాలను, బీబీనగర్ మండలంలోని జమీలాపేట్, రాయ రావుపేట్, పడమటి సోమారం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాలల్లో మౌలిక వసతులు, పరిసరాల శుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు అనుకూలంగా వసతులు ఉన్నాయా లేదా అనే విషయంలో పాఠశాల ఆవరణను పూర్తిస్థాయిలో సందర్శించారు.ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్లు ధరించాలని సూచించారు. కరోనా రెండో దశ నుంచి గట్టెక్కినప్పటికి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
విద్యార్థుల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యా యులకు ఆదేశించారు. రాయరావుపేట్ గ్రామంలోని పాఠశాలలో విద్యార్దులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. జమీలాపేట్ గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ను సందర్శిం చారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్, జిల్లా విద్యాశాఖ అధికారి చైత న్య జైని, మండల విద్యాశాఖ అధికారి నాగవర్దన్ రెడ్డి, పాఠశాల ప్రాధా నోపాద్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.