ఆలేరు టౌన్ : అంగన్వాడీ టీచర్లు పోషణ్ ట్రాకర్లో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలని సీడీపీఓ చంద్రకళ కోరారు. ఆలేరులోని ఐసీడీఎస్ ప్రాజెక్టులో గురువారం అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పథకాల అమలుపై పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా పోషణ్ ట్రాకర్ యాప్ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. మాతాశిశు సంరక్షణకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. యాప్ వినియోగం, సమాచార నమోదుపై త్వరలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సూపర్వైజర్లు పాల్గొన్నారు.