యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పునర్నిర్మాణ పనులు అందమైన తోరణాలతో పాటు ఆలయ ప్రహారికి అధునాతన విద్యుత్ దీపాలను అమరుస్తున్నారు. యాదాద్రిలో అనుబంధాలయమైన శివాలయ ప్రహారికి ప్రత్యేకంగా రూపొందించిన ప్యారాఫిట్ లైట్లను బిగిస్తున్నారు. వీటిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ద్వారక కంపెనీలో ఇనుము బీడుతో ప్రత్యేకంగా తయారు చేయించగా గురువారం యాదాద్రికి చేరుకోగా ఆర్ట్ డైరక్టర్ ఆనందసాయి పరిశీలించారు. అర్ధచంద్రకారంలో ఉండి పైభాగం స్వామివారి శంఖుచక్రంతో చూడముచ్చటగా ప్యారాఫిట్ లైట్లను ఉన్నాయి. ఆలయచుట్టు గల ప్రహారికి బిగించిన ఫిల్లర్బాక్స్లపై బిగించనున్నారు. మొత్తం 30 లైట్ల బిగించే పనులు సాగుతున్నాయని అన్నారు.
ఆలయ పనులను పరిశీలించిన ఆర్ట్ డైరెక్టర్
యాదాద్రి ప్రధానాలయంతో పాటు, శివాలయంలో జరుగుతున్న తుది మెరుగుల పనులు ఆర్ట్ డైరక్టర్ ఆనందసాయి గురువారం పరిశీలించారు. ప్రధానాలయంలోని క్యూలైన్లు, విద్యుత్ దీపాల బిగింపు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శివాలయంలోని తుదిదశకు చేరుకున్న రథశాలను పనులను పరిశీలించి పురోగతిని అడిగి తెలుసుకున్నారు.