యాదాద్రి, జూలై 29: యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణోత్సవాన్ని అర్చకులు గురువారం వైభవంగా నిర్వహించారు. ఉదయా న్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం జరిపారు. వేకువజామునే స్వయంభులు, బాలాలయ కవచమూర్తులను పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం ఆరాధనలు జరిపి తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించా రు. ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలకు అభిషేకం, తులసి అర్చనలు, శ్రీసుదర్శన హోమం, స్వామివారి నిత్య కల్యాణాన్ని శాస్ర్తోక్తంగా జరిపించారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠమూర్తుల కు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తు లు పాల్గొని వ్రతమాచరించారు. అనంతరం స్వా మివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామివారి ఖజానాకు రూ. 5,31,661 ఆదాయం
స్వామివారి ఖజానాకు రూ.5,31,661 ఆదా యం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 57,258, రూ.100 దర్శనంతో రూ.25,000, సుప్రభాతం ద్వారా రూ. 300, క్యారీబ్యాగులతో రూ. 1,100, సత్యనారాయణ స్వామి వ్రతాలతో రూ.4,000, కల్యాణకట్టతో రూ.8,000, ప్రసాద విక్రయంతో రూ. 1,80,875, శాశ్వత పూజలతో రూ. 10,116, వాహన పూజలతో రూ.7,000, టోల్గేట్తో రూ. 570, అన్నదాన విరాళంతో 1,06,464, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 68,020, యాదరుషి నిలయంతో రూ.23,150, పాతగుట్టతో రూ. 9,808, టెంకాయల విక్రయంతో రూ. 30,000తో కలుపుకొని రూ. 5,31,661 ఆదా యం సమకూరినట్లు ఆమె తెలిపారు.