స్వామి వారిని దర్శించుకుని తరించిన భక్తులు
శ్రీవారి ఖజానాకు రూ. 5,03,047 ఆదాయం
యాదాద్రి, జూలై 28: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్ని ధిలో బుధవారం సుదర్శన నారసింహ హోమం అర్చకులు వై భవంగా జరిపారు. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అ ర్చకులు స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధ నలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచా మృతాలలో నిజాభిషేకించి, తులసీ అర్చనలు జరిపారు. లక్ష్మీ నరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి సుదర్శన హోమం, లక్ష్మీ నరసింహుల నిత్య తిరుకల్యాణం, అలంకార సేవోత్సవాలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మ వారికి కుంకుమార్చనలు నిర్వహించారు. సత్యనారాయణస్వామి సామూహిక వ్రతా లతో భక్తుల పాల్గొని వ్రతమాచరించారు. యాదాద్రిలో స్వామి వారి దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు తర లివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామిని దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర ఎన్నికల కమి షనర్ పార్థసారధి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వ యంభువులను దర్శించుకున్న కమిషనర్కు అర్చకులు, అధికా రులు స్వామి వారి ఆశీర్వచనం, తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ అధికారులు గట్టు శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఖజానాకు రూ. 5,03,047 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 5,03,047 ఆదాయం వచ్చినట్లు ఆల య ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 59,006, రూ.100 దర్శనంతో రూ. 28,500, నిత్య కైంకర్యాలతో రూ. 3,201, సుప్రభాతం ద్వారా రూ.400, క్యారీ బ్యాగులతో రూ.1,650, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ.8,500, క ల్యాణకట్టతో రూ.7,360, ప్రసాద విక్రయంతో రూ.2,10, 270, శాశ్వత పూజల ద్వారా రూ.37,464, వాహన పూజల తో రూ. 6,600, టోల్గేట్తో రూ. 680, అన్నదాన విరాళం తో 32,046, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 48,440, యా దరుషి నిలయంతో రూ. 12,3500, పాతగుట్టతో రూ. 10, 580, టెంకాలయ విక్రయాలతో రూ. 36,000తో కలుపుకుని రూ. 5,03,047 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.