యాదాద్రి, జూలై21: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో బుధవారం స్వామివారి నిత్యారాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసి అర్చనలు జరిపారు. లక్ష్మీ నరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి శ్రీసుదర్శన హోమం, శ్రీలక్ష్మీ నరసింహుల నిత్య తిరుకల్యాణం, అలంకార సేవోత్సవాలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తరపూజలు జరిపారు. కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. సత్యనారాయణస్వామి సామూహిక వ్రతాల్లో భక్తుల పాల్గొన్నారు. యాదాద్రిలో స్వామివారి దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామివారిని దర్శించుకున్న వైస్ చాన్సలర్
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ తంగెడ కిషన్రావు సతీసమేతంగా దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు స్వామివారి ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు.
రూ. 8,88,274 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 8,88,274 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుక్కింగ్ ద్వారా రూ. 89,940, రూ. 100 దర్శ నం ద్వారా రూ. 421,300, వీఐపీ దర్శనాల ద్వా రా రూ. 21,000, నిత్యకైంకర్యాల ద్వారా రూ. 1,000, సుప్రభాతం ద్వారా రూ. 900, క్యారీబ్యాగుల ద్వారా రూ. 2,750, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 18,000, కళ్యాణకట్ట ద్వారా రూ.10,200, ప్రసాద విక్రయం ద్వారా రూ. 4,021,600, శాశ్వతపూజల ద్వారా రూ.11, 232, వాహనపూజల ద్వారా రూ. 10,300, టోల్గేట్ ద్వారా రూ. 610, అన్నదాన విరాళం ద్వారా 18,417, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,08,980, యాదరుషి నిలయం ద్వారా రూ. 38,200, పాతగుట్ట ద్వారా రూ. 13,365, కొబ్బెరియాల విక్రయాల ద్వారా రూ. 57,000, ఇతర విభాగాలు రూ. 42,480 తో కలుపుకుని రూ. 8,88,274 ఆదాయం సమకూరింది.