సిటీబ్యూరో, జూలై 10(నమస్తే తెలంగాణ): గన్పాయింట్ పెట్టి దోపీడీకి పాల్పడ్డ ఓ వీడియో వైరల్గా మారి నగర అపార్ట్మెంట్ వాసుల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన కొంపల్లి సినీ పోలీస్ ఉత్తమ్నగర్ ప్రాంతంలో జరిగిందన్న విషయం అవాస్తవం. వీడియోలో నలుగురు దుండగులు లోపలికి అర్బన్ క్లాప్ సంస్థ నుంచి వచ్చినట్లు చెబుతూ ప్రవేశించారని చూపుతుంది. వీడియోను పరిశీలిస్తే నలుగురు దుండగులు ఈ నెల 7వ తేదీన మధ్యాహ్నం 2.15 నిమిషాలకు ఓ అపార్ట్మెంట్లోకి ప్రవేశించి మహిళను బెదిరించి ఆమెను నిశబ్దంగా ఉండాలని, పాపను దగ్గరగా పెట్టుకోవాలని అరుపులు చేయొద్దని లేదంటే కాల్చేస్తామని హెచ్చరిస్తున్నట్లు కనిపిస్తుంది. కింద కూర్చొని భోజనం చేస్తున్న వ్యక్తిని కిందపడేసి చేతులను వెనకాలకు గుంజి కట్టేస్తున్నారు. ఇలా దాదాపు రెండున్నర నిమిషాలు ఉన్న దుండగులు ఇంట్లో ఉన్న సొత్తును దోచుకు వెళ్లినట్లు కనపడుతుంది. ఇది నగరంలో జరిగింది ఎంత మాత్రం కాదు.
ఇదీ.. ఢిల్లీ ఘటన: అయితే, వైరల్గా మారిన ఈ వీడియో హైదరాబాద్కు సంబంధించింది కాదని, ఈ ఘటన 7వ తేదీన ఢిల్లీలో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఓ రియాల్టర్ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు తుపాకీని చూపించి దాదాపు రూ.7 లక్షలను దోచుకెళ్లారని స్పష్టమైంది. ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ ఉత్తమ్నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఇలాంటి వీడియోలతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని నగర పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే వెంటనే ‘డయల్ 100’కు ఫిర్యాదు చేయాలని పోలీసు అధికారులు కోరుతున్నారు.